15, జనవరి 2016, శుక్రవారం

సమీక్షలు

నేటితరానికి మరో మహాప్రస్థానం ఈ.."మంత్రలిపి"కవితాసంపుటి 
...................................................
శ్రీశ్రీ తన మహా ప్రస్థానం సాగిస్తున్నప్పుడు "హరోం ! హరోం హర ! హర హర హర హర" అంటూ ఒక చిన్న బీజాక్షర మంత్రాన్ని ఉపదేశేసిస్తే , ఆబీజాక్షరానికి విస్తృతిని ఇచ్చి, దాన్ని విడమర్చి లిఖించిన పరిపూర్ణ మంత్రమె, కొనకంచి ఈ మంత్రలిపి.ఈయన ప్రతి కవిత ఒక నిజం.మనం తట్టుకోలేనంత నిజం.
అబద్దానికి అలవాటు పడిపొయి అదే నిజం అనే ఒక భ్రమతో ఆ అబద్దపు ప్రపంచంలో నిజం వెతుక్కొవటానికి ప్రయత్నం చేస్తూ ..వేలకు వేలఅబద్దాలలో మనకు నచ్చిన ఒక అబద్దాన్ని నిజం అనుకొనే అబద్దపు బ్రతుకులు బ్రతుకున్న మనకు నిఖార్సైన నిజం చూసినప్పుడు అదినిజం అనుకొనే ధైర్యం ఉండదు .అసలు దాన్ని నిజం అని గుర్తించే అవకాశం ఉండదు.అసలు ఆ నిజం ఉంటుంది అనే విషయం కూడా తెలియదు. కొనకంచి గారు ఆ నిజాల్ని మన కళ్ల ముందు పడేసి మనమెంత గుడ్డోళ్లమో మన కళ్ళకు చూపిస్తాడు. అసలు నిజం ఇదా అని మనల్నిఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత చీకటి గదిలో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని , మనల్ని మనం ఒకసారిచీకటితో కడుక్కొని వెలుగులోకి రావలనిపిస్తుంది. మనుషులందరూ వారి మనసులను నగ్నంగా మన కళ్ళముందు ప్రదర్శించుకుంటూతిరుగుతుంటారు .ఆ నగ్నత్వాన్ని తట్టుకొనే మానసిక ధైర్యం నీకుందా !!నువ్వొక కొత్త మనిషిలా మారతావు,నువ్వొక ఋషివవుతావు .ఆ ధైర్యం నీకు లేదా, నువ్వు మనుషులను చూసి భయపడతావు . కానీఇంత నిజాయితీని చూశాక నీలో ఉన్న మనిషితనం నిన్ను భయపడేలా చెయ్యదు .
కొనకంచి గారి రచనలలో అధివాస్తవికత (సర్రియలిజం) చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది .
" కాలం నల్ల లాంతరు పట్టుకొని 
చీకట్లో చీకటినివెతుక్కుంటూ 
బయల్దేరినప్పుదు " 
"తేలు కొండికి ..పాము కోరకి 
ఉండేది ప్రేమే అయితే
విషమే ఈ ప్రపంచాన్ని కొనే 

అతి గొప్ప వస్తువు కదూ... " 
"జీవితమంటే ...అనేకానేక కనిపించని మరణాలు " 
"వెలిగే దీపానికి ...తైలం ..దూరంగా ఉన్నట్లు " 
ఇలాంటి భావనలు కొనకంచి గారికి మాత్రమే సాధ్యం.
కొనకంచి గారి మాటలు కొరకంచులు నిప్పుల్ని మండిస్తూ ..ఆ మాటలు ..మనల్ని దహించి వేస్తాయి . అవిమనల్ని నిద్ర పోనీయవు.నిద్రలో కూడా మనల్ని వెంటాడతాయి ,వేధిస్తాయి మరోసారి నిద్రపోనీయకుండా ,నిద్రపోతున్న వారికి వేడి సెగ పుట్టించి నిద్రలేపుతాయి . "కూయకుండానే తొలికోడిని కోసేసిన
ఊరికి వేకువ ఎలా తెలుస్తుంది ?? “
" దశాబ్దాలనుండి దేశం మీద ప్రేమతో
మరణించిన వీరుల అంతిమ ఆర్తనాదాలు 
ఈదేశంలోనే నవ్వులపాలవటం నీకు తెలీదు "

ఆరోగ్యశ్రీ లో లేని సరికొత్త రోగాలు 
తెచ్చుకొని అర్ధాంతరంగా చావాల్సిందే " 
అంటూ మాటలతో ఫైర్ పుట్టించగలటం ఒకకొనకంచి గారి పెన్నుకే సాధ్యం .
ఈయన కవితల్లో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి, సమాజం మీద కత్తులు విసిరేసి మేల్కొలపటం చాలా మంది చేసింది , కానీ ఈయనపువ్వులు విసిరి కూడా లేపగలడు . "నా కలల ..ఇంద్ర ధనస్సుపై
నువ్వు కుచ్చుల పరికిణితో 
పరుగెడుతున్నట్లు అవుతుంది "
" నా కంఠం చుట్టూ చేతులు వేసి 
యుగళ గీతానికి మొదటి చరణమై
నువ్వు ..సుందరమో..సుమదురమో 
అని చెవుల్లో పాట పాడుతున్నట్లే ఉంది "
ఇంత సున్నితమైన భావనలు కూడా అంతే సూటిగా, వాడిగా చెప్పటం చాలా కష్టం . 
కవితల్లో విషాదాన్ని నింపటంలో కూడా కొనకంచి గారిదిఒక ప్రత్యేక శైలి
"నువ్వు ఎక్కి వెళ్ళిపోయిన రైల్వే స్టేషన్ 
చివరన నేను సిగ్నల్ గా మారి 
నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను "
"నువ్వు గుర్తు రాగానే 
ఎమరాల్డ్ పెదవుల మీద
ఓ నవ్వు వెలిసినట్లు . 
హృదయాన్ని తట్టిలేపే పువ్వుల వానలో ..
.మైమరిపించే చిరునవ్వుల జడిలో ..
నేను జల జలా తడిసిపోతాను "
"నేను ప్రయాణించే రైలెప్పుడూ నిర్జనంగానే ఉంటుంది .
. ఆ రైలు లో నేనొక్కడినే సుదీర్ఘ ప్రయాణికుణ్ణి "
ఇలా విషాదాన్ని, విరహాన్ని కూడా కొత్తగా చెప్పగలగతాడు .
జీవితాన్ని మోడరన్ గా జీవించమంటూనే విలువలు మర్చిఫోవద్దు అంటాడు. నాగరికత విశృంఖులత్వానికి మొదట బలయ్యేది స్త్రీనే కాబట్టిజాగ్రత్తగా ఉండమమని హెచ్చరించే పర్ ఫెక్ట్ ఫెమినిస్ట్. మనుషులు స్త్రీ ,పురుషుల్లా కాక టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లా మారిపొతే సమాజం మొత్తంబాస్టర్డ్స్ తో నిండిఫొతుంది అని కటువుగానే చెప్తాడు .
ఒక అమ్మాయికి పురుషాధిక్య సమాజం నుండి ఎలా కాపాడుకోవాలో చెప్తాడు. సగటు మనిషిలో ఉందే హిపోక్రసీ ని ఎండగడతాడు. తన సొంత ఊరిని చూసి చిన్నపిల్లాడైపోతాడు,
అమ్మ చిన్నప్పుడు కప్పిన పాత చీరల బొంతని చుట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు . స్నేహం పేరుతో జరిగే మోసాలు చెప్తాడులోకం తీరు ఎలా ఉందో తెలుసుకొని మసలుకోమంటాడు. మొత్తం మీద కవి సమాజానికి దిక్సూచి లాంటి వాడు అన్నట్లు ఈయన మత్రలిపిసమాజపు సంద్రంలో లంగరు వెయ్యటానికి వీల్లేని ఓడకు సరైన దిక్సూచి అవుతాడు, ఒక లైట్ హౌస్ అయి దారి చూపిస్తాడు యాదృచ్చికంగాజరిగిందేమో తెలియదు కానీ ఏ మంత్రమైన 108 సార్లు చదివితే చాలు అంటారు , ఇందులో సరిగ్గా 54 మంత్రాల్లాంటి కవితలున్నాయి.
ఇంత అద్భుతమైన కవితలను మనకందించిన కవి కొనకంచి గారికి ,శుభాభినందనలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి