19, జనవరి 2016, మంగళవారం

సాహిత్యం

ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది

న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.
న్యాయం ఎప్పుడూ..అన్యాయంతో యుద్ధంచేస్తుంది .న్యాయం..ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది.స్వశక్తితో మాత్రమే పోరాడుతుంది.
కాని అన్యాయానికి..పొరాడటానికి వంద చేతులు ..వంద ఆయుధాలు..వేలమంది..అభిమానులు...అనుచరులు...అన్యాయానికి ఒల్లంతా ..కళ్ళే ..ప్రతి కన్నుతో..ఏ మనిషికి ..ఆ మనిషికి విడి.విడిగా మనిషికో కమర్షియల్ సినిమా చూపిస్తుంది.నిమిషానికో సారి..నిమిషానికో రూపం తో వేశ్యగా మారి ..మనుషులని మాయ చేయాలని చూస్తుంది .
మనుషులని..మత్తులో ముంచేసేందుకు..మదిర..అవుతుంది..ఆడదవుతుంది.డబ్బు అవుతుంది..సుఖం అవుతుంది .సవుఖ్యమవుతుంది ..
ఇలా...ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు ..
నిజంకూడా అంతే...అబద్ధంతో .అన్నికాలాల్లోనూ పొరాడుతూనే ఉంటుంది.నిజం..ఒక్క మాట మాట్లాడితే..అబద్ధం ..వెయ్యి మాటలు మాట్లాడుతుంది.అబద్ధానికి వెయ్యి గొంతులు..అబద్ధానికి..వొళ్ళంతా అత్తరు వాసనే..మనిషి మనిషికీ..ఆయా మనుషులకు..ఇస్టమైన ..సుగంధాన్ని పంచుతూ..రంగూ రుచి వాసన మార్చుకుంటూ...అలా..పెరిగి పోతూనే ఉంటుంది .
అబద్ధం చేతిలో పత్రిక లుంటాయి .పబ్లిక్ రిలేషన్ శక్తులుంటాయి ..స్వార్ధంతో పనిచేసే ..మనుషులుంటారు ...నిద్రబొతే..తనను ఎవరైనా చంపేస్తారేమో అన్న ..భ్రాంతితో..అబద్ధం ఎప్పుడూ నిద్ర బోదు.అదిగాలిలో గాలి అయ్యి..అలా..ఏదో ఒక రూపంలో..ప్రయాణిస్తూనే ఉంటుంది...
ధర్మం కూడా ఎప్పుడూ అంతే..అది అధర్మం తో పొరాడుతూనే ఉంటుంది ..
న్యాయం ..నిజం..ధర్మం..ఈ మూడింటినీ నమ్ముకున్న మనిషి అందుకే ఎప్పుడూ సుఖంగా ఉండలేడు .చచ్చేవరకూ యుద్ధ చేస్తూనే ఉండాలి
ఈ మూడింటినీ..ఆచరించని మనుషులు అందుకే డబ్బుతోనూ ..వేశ్యలతోనూ..మందుతోనూ .మత్తులతో సుఖిస్తూ ఉంటారు.
ఈ మూడింటినీ ఆచరించే మనుషులు యుద్ధం చేస్తుంటారు ..కాని చరిత్రొలొ నిలిచేది..తరాలుగడిచినా చెప్పుకునేది ..ఈ పొరాట యోధుల గురించే .
అందుకే ..న్యాయం దెగ్గిర..నిజం దెగ్గిర... ధర్మం దెగ్గిర.. . మనుషులు స్ట్రాంగ్ గాఉండాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి