16, జనవరి 2016, శనివారం

సాహిత్యం


నేను....నా....మంత్రలిపి
..............................


నా చుట్టూ ఉన్న నా సమాజమే ..నాకవిత్వం..
నా చుట్టూ ఉన్న మనుషులే నా కవిత్వం
నా చుట్టూ ఉన్న ..నన్ను ద్వేషించే వాళ్ళే నాకవిత్వం.
నా చుట్టూ ఉన్న నన్ను ప్రేమించేవాళ్ళే నాకవిత్వం
.నా చుట్టూ ఉన్న అన్నివర్గాలూ నా కవిత్వమే .
నేను వేరు కాదు..నాకవిత్వం వేరు కాదు .
మనిషే నా కవిత్వం 
.....................................................................
అణగారిన వర్గాల్లో ఉన్న బాధ వేదన ..నాకు తెలుసు..ధనిక వర్గాల్లో ఉన్న బలుపులు..అహంకారాలు నాకు తెలుసు .ఏవరేం పోగొట్టుకున్నా రో సమాజం లో ఎవరేం పొందారో నాకు తెలుసు.
నాకు తెలిసిన విషయాలన్నీ నాకంటే ముందున్న మేధావులు..పార్టీలకు కట్టుబడి వర్గాలకు కట్టుబడి ..చెప్పలేకపోయారు .నేను వారిలా కాకుండా ..
సామాజిక శ్రేయస్సుకోసమే పార్టీలు కాని వ్యక్తిగతంగా ..నాయకుల ఆస్థుల్ని పెంచుకోవటానికి..నాయకులు దేశాన్ని అమ్ముతుంటే చూస్తూ ఉండటానికి కాదు..అని ఏ వర్గానికి ఏ పార్టీకి చెందకుండా..అన్నివర్గాలను..ముఖ్యంగా మనుషులను ప్రేమించే వ్యక్తిగా నేను సమాజంలో ఉన్న రుగ్మతలను ..నా కవితా సంపుటి మంత్రలిపిలో రాశాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి